byసూర్య | Fri, Jan 15, 2021, 10:19 AM
నల్గొండ: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు దాటుతున్న బైక్ను ఓ కారు అతివేగంగా దూసుకువచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిట్యాల సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.