byసూర్య | Fri, Jan 15, 2021, 09:42 AM
అమెరికా వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇక నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి షికాగోకు నాన్స్టాప్ విమానం ప్రారంభమైంది. మధ్యలో ఎక్కడా ఆగకుండా ఈ విమానం ప్రయాణిస్తోంది. దీంతో కొంత సమయం తగ్గుతోంది.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి షికాగోకు నాన్స్టాప్ విమానాన్ని ఎయిరిండియా శుక్రవారం ప్రారంభించింది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం షికాగో బయల్దేరనుంది. షికాగో నుంచి ప్రతి బుధవారం హైదరాబాద్కు మరో విమానం బయల్దేరనుంది. అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే కనీసం ఒకట్రెండు చోట్ల విమానాలు ఆగేవి. కానీ ఎయిరిండియా నాన్ స్టాప్ విమానం ప్రారంభించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.