byసూర్య | Fri, Jan 15, 2021, 07:48 AM
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో విషాదం నెలకొంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు నిషాంత్ ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాకపోవడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు గాలించగా, ఇవాళ తెల్లవారుజామున మురుగు కాల్వలో శవమై కనిపించాడు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.