మురుగు కాల్వ‌లో ప‌డి ఐదేళ్ల బాలుడు మృతి

byసూర్య | Fri, Jan 15, 2021, 07:48 AM

 కామారెడ్డి మున్సిపాలిటీ ప‌రిధిలోని దేవునిప‌ల్లిలో విషాదం నెల‌కొంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు నిషాంత్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మురుగు కాల్వ‌లో ప‌డి ప్రాణాలు కోల్పోయాడు. నిన్న మ‌ధ్యాహ్నం ఆడుకునేందుకు బాలుడు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లాడు. ఆ అబ్బాయి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన త‌ల్లిదండ్రులు గాలించ‌గా, ఇవాళ తెల్ల‌వారుజామున‌ మురుగు కాల్వ‌లో శ‌వ‌మై క‌నిపించాడు. బాలుడి మృతిపై త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


Latest News
 

ఏపీలో ఎన్నికలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. టీఎస్‌ఆర్టీసీ స్పెషల్ బస్సులు Tue, Apr 23, 2024, 07:55 PM
చదువుపై మక్కువ.. వద్దంటే పెళ్లి చేసిన పేరెంట్స్, పాపం నవ వధువు Tue, Apr 23, 2024, 07:48 PM
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే Tue, Apr 23, 2024, 07:44 PM
కవితకు బిగ్ షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు.. అప్పటిదాకా జైలులోనే Tue, Apr 23, 2024, 07:39 PM
కల్పన అనేది అబద్ధంలో దాగున్న నిజం.. ఆలోచింపజేస్తున్న స్మితా సబర్వాల్ ట్వీట్ Tue, Apr 23, 2024, 07:31 PM