హైదరాబాద్ లో బీజేపీ నేత ఆత్మహత్య..

byసూర్య | Wed, Jan 13, 2021, 01:56 PM

రియల్ ఎస్టేట్ వ్యాపారి, బీజేపీ నేత, తుర్కయాంజల్ పరిధిలోని తొర్రూర్ కు చెందిన 65 ఏళ్ల సంరెడ్డి వెంకట రెడ్డి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. శ్రీమిత్ర, జన చైతన్య, జీపీఆర్, స్పెక్టార్ తదితర సంస్థల ప్రతినిధిగా పనిచేస్తూ, దాదాపు ఆరు వేల ఎకరాల భూముల విక్రయాల్లో ఆయనకు ప్రమేయం ఉన్నట్టు గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన, ఆపై బీజేపీలో చేరి, కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
కాగా, ఓ భూమికి సంబంధించిన విషయంలో నెలకొన్న వివాదంలో మనస్తాపం చెందిన వెంకటరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆయన నిప్పంటించుకోగా, దాన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకట రెడ్డి నిన్న సాయంత్రం మరణించారని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


Latest News
 

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు జననం Sat, Apr 20, 2024, 02:02 PM
నీటి తొట్టెలో పడి బాలుడు మృతి Sat, Apr 20, 2024, 01:32 PM
ఇంటి వద్ద ఓటుపై శిక్షణ Sat, Apr 20, 2024, 01:30 PM
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ వట్టి పోతున్న తాగునీరు Sat, Apr 20, 2024, 01:28 PM
నేడు బీబీపేటకు షబ్బీర్ అలీ రాక Sat, Apr 20, 2024, 01:06 PM