నిజామాబాద్ జిల్లాలో 2 వేల కోళ్లు మృత్యువాత

byసూర్య | Wed, Jan 13, 2021, 01:37 PM

 జిల్లాలోని డిచ్‌ప‌ల్లి మండ‌లం యానంప‌ల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేల‌కు పైగా కోళ్లు మృత్యువాత ప‌డ్డాయి. గ‌త నాలుగైదు రోజుల నుంచి వ‌రుస‌గా ఒక‌ట్రెండు కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో కోళ్ల ఫారం య‌జ‌మాని రామ‌చంద్ర‌గౌడ్ అప్ర‌మ‌త్త‌మై ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగైదు రోజుల క్రితం చ‌నిపోయిన కోళ్ల క‌ళేబ‌రాల‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపారు. ఆ రిజ‌ల్ట్ ఇంకా రాలేదు. అంత‌లోపే బుధ‌వారం ఉద‌యం 2 వేల కోళ్ల‌కు పైగా మృతి చెంద‌డంతో.. స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మృతి చెందిన కోళ్ల‌ను స‌మీప అట‌వీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చిపెట్టారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM