byసూర్య | Wed, Jan 13, 2021, 12:43 PM
కూకట్పల్లిలో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. బుధవారం ఉదయం 9.25 గంటలకు కూకట్పల్లిలోని అస్బెస్టాస్ కాలనీలో స్వల్పంగా భూమి కంపించినట్లు తెలిసింది. భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చామని కాలనీవాసులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.