byసూర్య | Wed, Jan 13, 2021, 11:06 AM
జిల్లాలోని ఎల్కతుర్తి మండలం వల్లాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. అయితే బస్సు డ్రైవర్కు తీవ్రంగా గాయాలయ్యాయని, అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.