byసూర్య | Tue, Jan 12, 2021, 05:24 PM
హైదరాబాద్ లోని ఆర్.జే.ఎం ఇంటర్ ప్రైజెస్, ఈద్గా, మాదన్నపేట్ రోడ్డు వద్ద లక్కీ డ్రా సాకున మంచి బహుమతులు అందిస్తామంటూ అక్రమంగా భారీగా డబ్బు ఆర్జిస్తున్న ఐదుగురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ రైన్ బజార్ పొలీసులు అదుపులొకి తీసుకున్నారు. వీరి నుండి 19.900 /- రూపాయల నగదు, 50 లక్కిడ్రా కాయిన్స్, 5 సెల్ ఫోన్లు, 13 కలేక్టింగ్ బుక్స్, ఓ రిజిస్టర్, ఒక ఐడి కార్డు స్వాధీనము చేసుకుని తదుపరి విచారణ కొరకు రైన్ బజార్ పోలీసుల సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు.