తెలంగాణ రేషన్ పంపిణీలో కొత్త మార్పులు

byసూర్య | Tue, Jan 12, 2021, 05:04 PM

తెలంగాణలో రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఆపేశారు. ఇకపై ఈ అవసరం లేకుండా ప్రభుత్వం చేసింది. ఆహార భద్రత కార్డులో ఉన్న మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే సరిపోయేలా రేషన్ దుకాణాల్లో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా సరుకులను ఇకపై తీసుకోవచ్చు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఆదేశాలు జారీ కావడంతో లబ్ధిదారుల ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయిందో లేదో పరిశీలించి లింక్‌ లేకుంటే మీ సేవ లేదా ఈ-సేవలకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్‌కు తాత్కాలికంగా నిలిపివేసి పూర్తిగా ఓటీపీ పద్ధతి ద్వారా సరుకులు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. దీంతో ఆధార్‌తో మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయి ఉంటేనే రేషన్‌ సరుకులు తీసుకునే వీలుంది.
అయితే, కొందరు లబ్ధిదారులకు మొబైల్‌ నంబర్లు లేకపోవడం, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లు పనిచేయకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ఆధార్‌కు కొత్త నంబర్లను లింక్‌ చేసుకునేందుకు ఈ నెలాఖరులోగా వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వ చౌకధరల దుకాణానికి సబ్సిడీ సరుకులు కోసం వెళ్లే లబ్ధిదారులు డీలర్‌కు తమ ఆహార భద్రత కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి. ఈ-పాస్‌ యంత్రంపై కార్డు నంబర్లు ఎంటర్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పగానే డీలర్‌ దానిని ఫీడ్‌ చేస్తే సరుకుల పంపిణీకి ఆమోదం లభిస్తుంది.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM