ఆస్పత్రిలో భార్య..రక్తంతో లెటర్‌ రాసి భర్త సూసైడ్

byసూర్య | Tue, Jan 12, 2021, 01:20 PM

కాపురంలో కలతలు ఉండటం సహజం. వాటిని సర్ధుబాటు చేసుకుని ముందుకుపోతే సంసారం అనేది ఎంతో హాయిగా ఉంటుంది. కానీ కొందరు సున్నితమైన వారు ఆ గొడవలను భూతద్దంలో పెట్టి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పిట్ల నవీన్(26) అనే వ్యక్తి తనభార్యతో కలిసి శామీర్ పేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
అయితే నవీన్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో నవీన్ భార్య రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో భార్య పరిస్థితిని చూసిన నవీన్ తల్లడిల్లిపోయాడు. తన భార్య తనకు దక్కదనే ఆందోళనతో ఆమెను కాపాడలేకపోతున్నానని బెగపెట్టుకున్నాడు. అంతే లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నవీన్‌ తన చేతికి గాయం చేసుకుని రక్తంతో "నిన్ను నేను కాపాడుకోలేక పోతున్నాను" అనే సారాంశం వచ్చే విధంగా లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. భార్య ఇక తనకు దక్కదనే ఆవేదన..తన ముందే భార్య ఆత్మహత్య చేసుకున్నా.. కాపాడలేకపోతున్నాననే మనోవేదనే నవీన్‌ ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న శామీర్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM