byసూర్య | Mon, Jan 11, 2021, 03:46 PM
తెలంగాణ మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్పర్సన్గా ఎంపికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళల భద్రత, తీసుకోవలసిన చర్యలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు కావటం సంతోషకరమన్నారు. తెలుగు మహిళల కృషి కారణంగానే మహిళా కమిషన్ను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కొత్త ఛైర్పర్సన్ కృషి చేయాలన్నారు. సునీత లక్ష్మారెడ్డిని కలిసిన వారిలో జ్యోత్స్నతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రమీల, ప్రధాన కార్యదర్శులు రాధిక, నందిమ్మళ్ళ శారద, వినీత, కార్యనిర్వాహక కార్యదర్శి ఝాన్సీ తదితరులు ఉన్నారు.