అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య..

byసూర్య | Mon, Jan 11, 2021, 12:53 PM

అత్తింటి వేధింపులకు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.కామారెడ్డికి చెందిన లక్ష్మీనారాయణగౌడ్‌ కుమార్తె ఉదయశ్రీని కొత్తపేట పరిధి హరిపురికాలనీకి చెందిన సురేష్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేశారు. సురేష్‌ ప్రైవేటు ఉద్యోగి కాగా.. ఉదయశ్రీ ప్రైవేటు కళాశాలలో గతేడాది వరకు ఉద్యోగం చేసింది. ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కావడం లేదంటూ భర్తతోపాటు అత్త సావిత్రి, మామ తిర్మల్‌గౌడ్‌లు ఉదయశ్రీని తరచూ మానసికంగా వేధిస్తుండేవాడు.
కొన్ని నెలల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌ పరిధి గౌతంనగర్‌లో ఉదయశ్రీ దంపతులు వేరు కాపురం పెట్టారు. అయినా అత్తింటి వారి వేధింపులు తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి చేరుకున్న సురేష్‌ ఎంత పిలిచినా ఉదయశ్రీ తలుపులు తీయకపోవడంతో 100కు డయల్‌ చేశాడు. సరూర్‌నగర్‌ పోలీసులు చేరుకుని తలుపులు విరగ్గొట్టి చూడగా.. అప్పటికే ఉదయశ్రీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ కుమార్తెను ఆమె భర్త, అత్తామామలు తీవ్రంగా వేధించారని, తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని, వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం ఆదేశాల మేరకు ఎస్సై రవికుమార్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం Fri, Mar 29, 2024, 08:15 PM
మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు Fri, Mar 29, 2024, 08:15 PM
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ, కలెక్టర్ Fri, Mar 29, 2024, 08:14 PM
టీడీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి Fri, Mar 29, 2024, 08:13 PM
తెలంగాణలో రైతులకు గుడ్‌న్యూస్.. మూడు రోజులు ముందుగానే! Fri, Mar 29, 2024, 08:10 PM