byసూర్య | Mon, Jan 11, 2021, 12:22 PM
మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు భేటీ కానున్నారు. ప్రగతి భవన్ లో ఈ రోజు జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా 16 నుంచి టీకా పంపిణీ నేపథ్యంలో వ్యాక్సిన్ నిల్వ, వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. ఇక రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే విద్యా సంస్థలను తెరవడంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.