byసూర్య | Mon, Jan 11, 2021, 12:17 PM
గత నెల నుంచి తెలంగాణలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో మందు కొట్టి బైక్ నడుపుతున్న షాద్ గనర్ సమీపంలోని నందిగామకు చెందిన రాజు అనే వ్యక్తి పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని గమనించి, తన భార్యను, బైక్ ను వదిలేసి పారిపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని రాజు భార్య, అక్కడే ఏడుస్తూ కూర్చుంది. భర్త పరుగు తీయడంతో, ఏడుస్తూ కూర్చున్న ఆమెను గమనించిన పోలీసులు.. స్టేషన్ కు తీసుకెళ్లి, ఆపై బంధువులకు అప్పగించారు.