byసూర్య | Mon, Jan 11, 2021, 11:40 AM
వికారాబాద్ జిల్లాలో కల్తీకల్లుకు మరొకరు బలయ్యారు. నవాబుపేట మండలం వట్టిమినేనిపల్లికి చెందిన కొమురయ్య.. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య రెండుకు చేరింది.వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపింది. డిపోలో అమ్ముతున్న కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురికావడంతోపాటు నిన్న ఒకరు మృతి చెందడం కలకలం సృష్టించింది. రోజంత కష్టపడి ఉపసమనం కోసం డిపోకు వెళ్లి కల్లు తాగుదామనుకునేవారికి ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. రోజూ తాము తాగే కల్లు కల్తీదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నవాబుపేట మండలంలో 102 మంది అస్తస్థతకు గురయ్యారు. ఈ రెండు మండలాల్లోని 18 గ్రామాలకు చిట్టిగిద్ద నుంచి కల్లు సరఫరా అవుతుంది. 11 గ్రామాల్లో 212 మంది అస్వస్థతకు గురయ్యారు.