byసూర్య | Sun, Jan 10, 2021, 12:34 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. జిల్లాలోని కాలేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 100 కింటాళ్ళ పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మహా ముత్తారం మండలంలోని గొల్ల బుద్ధారం గ్రామం నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని ఎస్ఐ నరహరి తెలిపారు. డీసీఎంను సీజ్ చేశామని, ఇద్దరిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.