మహబూబాబాద్ జిల్లాలో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం

byసూర్య | Sun, Jan 10, 2021, 12:03 PM

మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలను కోల్పోయారు. మహబూబాబాద్‌ మండలం ఆమనగల్లు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాధమ్మ (49) బట్టలు ఆరేస్తుండగా దండెం తీగకు విద్యుత్‌ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమెను రక్షించే క్రమంలో భర్త సత్తయ్య (59) ప్రయత్నించడంతో ఆయన సైతం విద్యుదాఘాతానికి గురయ్యాడు.


ఆ దంపతుల కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు యత్నించారు. ఇందే క్రమంలో ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య, ఆయన భార్య లక్ష్మి సైతం కరెంట్ షాక్‌కు గురయ్యారు. విద్యుదాఘాతానికి గురై ఒకరి తరువాత మరొకరు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సంబంధించి కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేట్టారు. ఈ ఘటనతో అమనగల్లు గ్రామంలో తీవ్ర విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.


Latest News
 

ఇసుక టిప్పర్ పట్టివేత Thu, Apr 18, 2024, 10:39 AM
నేడు నామినేషన్ వేయనున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి Thu, Apr 18, 2024, 10:38 AM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Apr 18, 2024, 10:24 AM
లోక్ సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి Thu, Apr 18, 2024, 10:23 AM
కేదార్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం అన్నప్రసాదం వితరణ Thu, Apr 18, 2024, 10:11 AM