byసూర్య | Sun, Jan 10, 2021, 09:28 AM
హైదరాబాద్: నగర శివార్లలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం కలకలం రేపింది. కూతురును విమానం ఎక్కించడానికి వెళ్లిన మహిళ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనచెందిన ఆమె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాకు చెందిన శోభారాణి.. నిన్న తన కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చింది. కూతురును విమానం ఎక్కించిన ఆమె.. తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె బంధువులు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.