byసూర్య | Sat, Jan 09, 2021, 02:06 PM
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఓ యువకుడు తల్లిని చేశాడు. తీరా తల్లిని చేశాక పెళ్లి చేసుకోమంటే చేసుకునేది లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేశాడు. వివరాల్లోకి వెళ్తే రెండేళ్ల క్రితం మైనర్ బాలిక ఓ షాప్ లో పనిచేసేది. ఆ సమయంలో సమీర్ అనే యువకుడు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటానని లోబర్చుకున్నాడు. గతేడాది నవంబర్ 12న సదరు బాలిక పాపకు జన్మినిచ్చింది. అయితే పెళ్లి చేసుకోవాలని సమీర్ ని బాలిక తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేశారు. అయితే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంతో కరీంనగర్ మహిళ పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలంటూ సమీర్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.