byసూర్య | Mon, Oct 19, 2020, 12:25 PM
నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రాంతాలన్నీ జల దిగ్భంధంలో ఉండిపోయాయి. దీంతో ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉ్రదిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు. వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువులు, నాలాల కబ్జాకు కారణమైన..అధికారుల్ని సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తగు రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.