byసూర్య | Mon, Oct 19, 2020, 09:30 AM
మూసీ ఉగ్రరూపానికి పూరానాపూల్లో నదిపై ఉన్న వంతెనకు పగుళ్లు వచ్చాయి. దీంతో పోలీస్ అధికారులు ముందు జాగ్రత్తగా వంతెన నుంచి రాకపోకలు నిలిపివేశారు. వారం రోజుల్లో రెండు సార్లు హైదరాబాద్లో వర్షం కురిసింది. రికార్డ్ స్థాయిలో కురిసిన వర్షానికి వరద మూసీని ముంచెత్తింది. వరద కారణంగా పూరానాపూల్ వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా వంతెనను మూసివేశారు. జియాగూడ, కార్వాన్ నుంచి వచ్చే ట్రాఫిక్ను పూరానాపూల్ నుంచి అఫ్జల్గంజ్ వైపు మళ్లిస్తున్నారు. కాగా, వంతెన పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నికల్ టీంను రప్పించనున్నట్లు అధికారులు తెలిపారు.