byసూర్య | Fri, Oct 16, 2020, 03:46 PM
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంపిసి స్ర్టీమ్ కోర్సుల్లో బి.టెక్ ( అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బి.టెక్(ఫుడ్ టెక్నాలజీ) ఫార్మర్స్ కోటాకు సంబంధించిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బి.టెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) 18సీట్లు, బి.టెక్ (ఫుడ్టెక్నాలజీ) 18సీట్లను టీఎస్ఎంసెట్-2020 (ఎంపిసి స్ర్టీమ్) ర్యాంకుల ఆధారంగా రిజర్వేషన్లకు లోబడి సీట్లను భర్తీచేస్తారని విశ్వవిద్యాలయ రిజిష్ర్టార్ డా.సుధీర్కుమార్ తెలిపారు. ఫార్మర్స్ కోటా (రైతుకోటా)లో సీటు పొందేందుకు అభ్యర్థి కనీసం 4 సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో (ఫామ్-1) విద్యాభ్యాసం చేసి ఉండాలని, కనీసం ఒక ఎకరం భూమి (ఫామ్-2) తల్లి లేదా తండ్రి లేదా అభ్యర్ది పేరుమీద కలిగి ఉండాలని అన్నారు. పూర్తి వివరాలను యూనివర్శిటీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.