byసూర్య | Fri, Oct 16, 2020, 03:46 PM
నానక్రామ్ గూడ, భగీరథ చెరువు కబ్జాకు గురైందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువు కబ్జాకు గురౌతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు నగరమంతా మునిగిపోతుంటే.. మరోవైపు నాళాలు, చెరువులు కబ్జాకు గురౌతున్నాయి.
భగీరథ చెరువుకు పెద్ద ఎత్తున వర్షపునీరు రావడంతో చెరువు అలుగుపారుతోంది. ఆ అలుగు నీటిని కబ్జాదారులు పెద్ద కాలువలు తవ్వి బయటకు పంపిస్తున్నారు. ఈ కెనాల్తో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.