byసూర్య | Fri, Oct 16, 2020, 03:38 PM
భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల జన జీవనాన్ని ఉద్దేశించి హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.... కుండపోతగా కురిసిన వానలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని సూచించారు.