byసూర్య | Fri, Oct 16, 2020, 02:51 PM
కాంగ్రెస్, బీజేపీలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేవిూ లేదని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. వారు ఎన్నికలనగానే వాలుతారని, తరవాత పత్తా ఉండరని ఎద్దేవా చేశారు. దుబ్బాక మండలంలోని రామక్కపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తరపున ఎన్నికల ప్రచారంలో హరీష్రావు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి ఉన్నది ఒక్క ఎమ్మెల్యే.. ఆ పార్టీతో ప్రజలకు ప్రయోజనం ఏవిూ లేదన్నారు. తెలంగాణ నీటి కష్టాలు తీర్చింది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ కష్టాలు తీర్చేది కేసీఆర్ మాత్రమేనన్నారు.