byసూర్య | Fri, Oct 16, 2020, 01:26 PM
నగరంలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మిథిలా నగర్, ఎమ్ఎల్ఆర్ కాలనీ వరద ముంపుకు గురైంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులకు నిత్యవసర వస్తువులు, పాలు, నీరును అందజేస్తున్నారు.