byసూర్య | Fri, Oct 16, 2020, 01:07 PM
సీఎం కేసీఆర్ పై మరోసారి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నిక తెలంగాణ చరిత్రలో కీలక మలుపు కావాలని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు దుబ్బాక ఎన్నికే ఓ నాంది కావాలని పేర్కొన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతు నాయకుడు అంటే ఇలా ఉండాలని చూపించిన వాడు చెరకు ముత్యం రెడ్డి.. రైతుల కోసం నిత్యం తపించేవాడు.. చెక్ డ్యాములు కట్టించాడు.. సబ్ స్టేషన్లు కట్టించాడని తెలిపారు. ఒక వైపు భారీ వర్షాలతో రైతులు నిండా మునిగిపోతే.. వెంటనే ఏరియల్ సర్వే చేసి ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి ఉద్యాన శాఖ రివ్యూ అని రివ్యూ పెట్టాడని...అసలు ఆయనకేమైనా పిచ్చి పట్టిందా..?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇస్తామని భరోసా ఇవ్వాలని.. కానీ ఏం చేస్తున్నాడో మీరే చూస్తున్నారని వెల్లడించారు. దుబ్బాకలో శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని... ఈ ఉత్సాహమే కాంగ్రెస్ విజయానికి ఢోకా లేదనే సంకేతాలు ఇస్తోందన్నారు. ముత్యం లాంటి మనిషి చెరకు ముత్యంరెడ్డి వారసత్వాన్ని నిలబెట్టేందుకు దుబ్బాకలో ఈ సారి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.