byసూర్య | Fri, Oct 16, 2020, 12:03 PM
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మజీద్ పూర్ రాజీవ్ రహదారిపై 2 బైక్ లు ఢీకొన్నాయి. శామీర్ పేట్ మండలంలోని మజీద్ పూర్ గ్రామానికి చెందిన పూర్ణచంద్ర అనే వ్యక్తి విమల ఫీడ్స్ కంపెనీలో కూలి పని చేసుకొని గ్రామానికి వెళ్తున్న సమయంలో తుర్కపల్లి నుంచి అతి వేగంగా వస్తున్నా మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.