byసూర్య | Fri, Oct 16, 2020, 11:51 AM
ఈ నెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ కొంకణ్ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలిసిపోయిందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది.