తెలంగాణలో తాజాగా 1,432 కరోనా కేసులు

byసూర్య | Thu, Oct 15, 2020, 10:42 AM

దక్షిణాదిన కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఏపీ, తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 1,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,17,670కి చేరింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 8 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,249కి చేరింది.తెలంగాణలో కరోనా బారి నుంచి ఇప్పటివరకూ 1,93,218 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్ కేసులున్నాయి. 19,084 మంది డాక్టర్ల సలహాలు, సూచనలతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 27,03,047 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM