బాలికపై అఘాయిత్యానికి పాల్పడిని కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలి : కవిత

byసూర్య | Wed, Oct 14, 2020, 03:42 PM

తెలుగు రాష్ట్రాల్లో దొంగబాబాల దారుణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వైద్యం పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దొంగబాబా. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఆమెపై దారుణం జరిగినట్టు తెలవడంతో దొంగబాబాపై బాధితురాలు తల్లిదండ్రులు దాడి చేసి, దేహశుద్ధి చేశారు.


ఈ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిని కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలని అన్నారు. దొంగబాబాను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.మరోవైపు కవిత ఆదోశాలతో బాధితురాలని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. బాధితురాలకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరో వైపు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM
కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థి ఖరారు.. మాజీ మహిళా మంత్రి కుమారుడికి ఛాన్స్ Tue, Apr 16, 2024, 07:30 PM
హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్.. త్వరలోనే ప్రారంభం, వీరికి గుడ్‌న్యూస్ Tue, Apr 16, 2024, 07:26 PM
అయోధ్య రాముని పాదాల చెంత రఘునందన్ రావు నామినేషన్ పత్రాలు Tue, Apr 16, 2024, 07:22 PM
గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికీ 5 లక్షలు Tue, Apr 16, 2024, 07:16 PM