byసూర్య | Wed, Oct 14, 2020, 02:57 PM
రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా రాజేంద్రనగర్ మైలార్దేవుపల్లిలోని పల్లె చెరువుకు గండి పడింది. చెరువు పూర్తిగా నిండడంతో కట్ట తెగి వరద నీరు కిందకు ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా పూర్తిస్థాయిలో చెరువు కట్ట ధ్వంసమయ్యే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అల్జుబేల్ కాలనీ, అలీ నగర్, గాజీ మిలన్ కాలనీ, నింరా కాలనీ, ఉప్పుగూడా, లలితా బాగ్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని...అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే రెవెన్యూ , మున్సిపల్ , పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.