రోడ్లన్నీ జలమయం... ఈ ప్రాంతాల్లో ఇలా వెళ్ళండి..

byసూర్య | Wed, Oct 14, 2020, 02:20 PM

హైదరాబాద్ లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా రహదారులన్నీ జలమయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపేసిన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.


హైదరాబాద్‌-కర్నూలు హైవే దెబ్బతింది. దీంతో శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లేవారందరూ ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని చెప్పారు.


మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌక్‌ ప్లైఓవర్ వాడకూడదని, సెవెన్‌ టూంబ్స్‌ నుంచి వెళ్లాలని తెలిపారు.


పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును పూర్తిగా మూసేసి, వాహనాలను కార్వాన్‌ మీదుగా మళ్లిస్తున్నారు. 


మరోవైపు మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ కావడంతో ఆ మార్గంలో వచ్చే వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపుతున్నారు.  


మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మార్గం పూర్తిగా బ్లాక్ అయ్యింది. 


మూసీ నది నుంచి బయటకు నీరు రావడంతో మూసారాం బాగ్ బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM