నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో... ముగ్గురు మృతి

byసూర్య | Wed, Oct 14, 2020, 01:12 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ పాత ఇల్లు పైకప్పు కూలిపోయింది. ఈ దుర్గటనలో ముగ్గురు మృతి చెందారు. నాగర్ కర్నూలు మండలం, కుమ్మెర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి యజమాని హనుమంతరెడ్డితోపాటు అతని భార్య అనసూయమ్మ, మనుమడు హర్షవర్థన్ రెడ్డి మృతి చెందారు. ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో మృత్యువాత పడ్డారు. వెనుకగదిలో నిద్రిస్తున్న హనుమంతరెడ్డి కోడలు, మరో మనుమడుకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారికి నాగర్ కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM