byసూర్య | Wed, Oct 14, 2020, 12:53 PM
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హిజ్రా హంస మృతి చెందింది. పరిస్థితి విషమించడంతో హిజ్రా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హంస మృతికి కారణమైన సదా వర్గం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హిజ్రా సదా వర్గం పరారీలో ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.