అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాలు

byసూర్య | Tue, Oct 13, 2020, 01:09 PM

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


రిజర్వేషన్లు ఖరారు చేయకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సీపీఐ నేతలు అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. వారంతా అసెంబ్లీ వద్దకు దూసుకురావడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు‌ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తమ నేతలను అరెస్టు చేయడం పట్ల బీజేపీ తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.


నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించిందని బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కరోనా వేళ ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలపై అదనపు భారం మోపిందని మండిపడింది. ఎంఐఎం కోసం ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించింది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM