byసూర్య | Mon, Oct 12, 2020, 07:02 PM
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లగా మారిపోయింది. మరోవైపు వరి నెలబారి పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.