తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు...

byసూర్య | Mon, Oct 12, 2020, 06:09 PM

తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను కావాలనే తక్కువ చేసి చూపుతున్నారని మండిపడింది.


ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన వెద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా తగ్గిందని కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కోర్టు స్పందిస్తూ... టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎన్నున్నాయో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.


ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదని చెప్పింది. తప్పుడు లెక్కలతో హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.


Latest News
 

సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM
అల్లాపూర్ గ్రామంలో ఇప్పటికీ తీరని నీటి కష్టాలు Thu, Mar 28, 2024, 01:38 PM
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ Thu, Mar 28, 2024, 01:37 PM