byసూర్య | Mon, Oct 12, 2020, 04:49 PM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న బ్రీజా కారు బ్రేక్ లు ఫెయిలవ్వడంతో ముందు ఉన్న రెండు బైక్స్,ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మరణించగా యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. స్కూటీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. యువతి,యువకులు ప్రేమికులుగా తెలుస్తోంది. హయత్ నగర్ కు చెందిన శ్రీలత,నాగరాజులు ప్రేమ వివాహం కోసం చెరువుగట్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.