byసూర్య | Mon, Oct 12, 2020, 04:16 PM
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి అవసరాల నిమిత్తం సోమవారం మల్లాపూర్ లో నోమ ఫంక్షన్ హాల్ లో మహిళ పోలీస్ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కమిషనరేట్ పరిధిలో 427 మంది మహిళా సిబ్బంది ఉన్నారు, వారి డ్యూటీలో భాగంగా ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహిళా సిబ్బంది కోసం అవసరమైన వాటి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించేలా చేస్తామని అన్నారు.