byసూర్య | Mon, Oct 12, 2020, 04:15 PM
ఓబీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను రాష్ట్రంలో ఏడాది అయినా అమలు కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినవారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.