byసూర్య | Mon, Oct 12, 2020, 03:14 PM
ఈనెల 13, 14 తేదీల్లో ని అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలలో జిహెచంఎంసి చట్టాల సవరణకు ఆమోదం తెలపనున్నారు. ఈ మేరకు కేబినేట్ కూడా చర్చించింది. సమావేశాల నేపధ్యంలో కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ మేరకు అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి ఉభయ సభల ప్రాంగణాలలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యంగా ఉభయ సభల ప్రాంతాణల్లో కొవిడ్ పరీక్షల నిమిత్తం ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా శాసన మండలి కార్యదర్శి నరసింహాచార్యులను ఆదేశించారు. సమావేశాలకు హాజరయ్యే శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, ఉభయసభల సిబ్బంది, విూడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందిలలో ఎవరికైనా అనుమానం ఉన్నా, కరోనా లక్షణాలు కనిపించినా తప్పక పరీక్షలు చేయించుకోవల్సిందిగా శాసనసభ స్పీకర్ ఆదేశించారు.