కొండాపూర్‌లో ధ‌ర‌ణీ వివ‌రాలు సేక‌రించిన‌ బ‌ల్దియా క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్‌

byసూర్య | Mon, Oct 12, 2020, 02:23 PM

కొండాపూర్ డివిజ‌న్ లో జీహెచ్ఎంసీ చీఫ్ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ ప‌ర్య‌టించారు. ధ‌ర‌ణీ స‌ర్వే తీరును ప‌రిశీలించిన లోకేష్ కుమార్ స్వ‌యంగా ప‌లువురు నివాసితుల వివ‌రాల‌ను ధ‌ర‌ణీ ఆన్‌లైన్‌లో పొందుప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ధ‌ర‌ణి స‌ర్వే విష‌యంలో అపోహ‌లు వ‌ద్దని, సిబ్బందికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. ధ‌ర‌ణి స‌ర్వే నిర్వ‌హించే సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు అంద‌జేశారు. ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌ధానంగా ఏ అంశాల‌పై ప్రజ‌ల్లో ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌నే విష‌యాన్ని ఆరాతీశారు. లోకేష్ కుమార్ వెంట శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌, ఉప‌క‌మిష‌న‌ర్ తేజావ‌త్ వెంక‌న్న‌, ఏఎంసీ సుభాష్, రెవెన్యూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM