byసూర్య | Mon, Oct 12, 2020, 12:20 PM
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నారాయణరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన కవితకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.