byసూర్య | Mon, Oct 12, 2020, 12:14 PM
ఐపీఎల్ను సరదాగా చూడటంలో కచ్చితంగా తప్పులేదని.. కానీ కొందరు యువత దాన్ని లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ట్విట్టర్ లో సూచించారు. ముఖ్యంగా మీ పిల్లలు కంప్యూటర్, సెల్ఫోన్లతో బిజీగా ఉంటే వారేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. తమ పిల్లలను పట్టించుకోకపోతే బెట్టింగ్ నిర్వహించేవారితో పాటు ఆడేవాళ్లూ శిక్షార్హులని అంజనీ కుమార్ అన్నారు.