byసూర్య | Sun, Oct 11, 2020, 02:34 PM
ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దుయ్యబట్టారు. ముగ్గురికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయవచ్చా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం సీఎం తాపత్రయం పడుతున్నారని, ముస్లింల ఓట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. మైనార్టీలను బీసీల్లో చేరుస్తారా? అని బండి సంజయ్ నిలదీశారు.