నగరంలో మిస్సింగ్ కేసులు

byసూర్య | Sat, Oct 10, 2020, 12:55 PM

నగరంలో మిస్సింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజుల్లో ఐదుగురు అదృశ్యమయ్యారు. వేరు వేరు ప్రాంతాలలో జరిగిన ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కొంపల్లిలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైంది. భర్తతో గొడవపడిన భాగ్య అనే మహిళ పిల్లలు శ్రీచరణ్, ధన్‌కుమార్‌లతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల అంజూదేవీ ఈ నెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. హయత్ నగర్ మండలం తట్టి అన్నారంలోని లారా అనే ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లేకుండా పోయింది. నిత్యం చాటింగ్ చేస్తుందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఏడు పోలీసు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.  


 


 


Latest News
 

అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM
నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం Thu, Apr 25, 2024, 12:55 PM
నేను సాటి కానప్పుడు.. నాపై విమర్శలు ఎందుకు: డీకే అరుణ Thu, Apr 25, 2024, 12:47 PM
ఇంటర్ ఫలితాల్లో 62. 82 శాతం ఉత్తీర్ణత Thu, Apr 25, 2024, 12:20 PM
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి Thu, Apr 25, 2024, 12:11 PM