byసూర్య | Sat, Oct 10, 2020, 12:41 PM
అక్టోబర్ మాసం వచ్చిందంటే చాలు ఫెస్టివల్ సీజన్ వచ్చేసినట్లే. ఈ పండుగ సీజన్ లో చాలా మంది నూతన వాహనాలు కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేసుకునాలనుకునే వారికి ప్రముఖ కార్ల కంపెనీ హోండా కార్స్ అదిరిపోయే బంపరాఫర్లను ప్రకటిస్తోంది. హోండా కార్స్ తాజాగా గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ఫెస్టివల్ ఆఫర్లకు తెరతీసింది. పండుగ సీజన్లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వారికి వాటి ధరల ఆధారంగా సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్షిప్స్ వద్ద పండుగ ఆఫర్లు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పండుగ సీజన్ను మరింత సంతోషకరంగా మార్చేందుకు ఈ కొత్త ఆఫర్లు తీసుకువచ్చామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాజేశ్ గోయల్ తెలిపారు. స్మార్ట్ ఫైనాన్స్ ఆప్షన్స్, ఈజీ ఈఎంఐ, ఎక్కువ కాలం టెన్యూర్ వంటి సౌలభ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే హోండా అమేజ్ కారు కొంటే ఏకంగా రూ.47 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
హోండా సిటీ 5 జనరేషన్ కారుపై రూ.30 వేల వరకు, హోండా జాజ్ కారుపై రూ.40 వేల వరకు, హోండా డబ్ల్యూఆర్ వీ మోడల్పై రూ.40,000 వరకు, హోండా సివిక్ కారుపై అయితే ఎవరూ ఊహించని విధంగా బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ.2.5 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ తగ్గింపు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్టెండెంట్ వారంటీ, హోండా కేర్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వంటి వాటి రూపంలో ఈ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు కారు ధరకు 100 శాతం ఫైనాన్స్ సమకూరుస్తున్నాయి.