సిరిసిల్లలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు

byసూర్య | Sat, Oct 10, 2020, 11:52 AM

 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శుక్రవారం అర్ధరాత్రి టాక్స్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు జరిపారు. పట్టణంలోని లక్ష్మీ టాకీస్‌ ప్రాంతంలో దాడులు జరిపి.. వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.25లక్షల విలువైన రాగి, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. పట్టుకున్న రాగి, ఇతర సామగ్రి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో వినియోగిస్తుంటారు. ఈ సామగ్రి అంతా సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ (సెస్‌)కు చెందినదిగా భావిస్తున్నారు. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి, పట్టుకున్నారు. సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాగి తీగతో పాటు ఇతర సామాను ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు? ఎవరి నుంచైనా కొనుగోలు చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న రాగి, సామగ్రి విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.


 


 


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM