byసూర్య | Fri, Oct 09, 2020, 06:57 PM
భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండవేడిమితో నగరవాసులు ఇక్కట్లు పడుతున్నారు. సాయంత్రం ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట, టోలిచౌకి, ఎస్సార్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, బోరబండ, ముషీరాబాద్, గాంధీనగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్డు, రాంనగర్, అబిడ్స్, అఫ్జల్గంజ్, కోఠి, పురానాపూల్లో భారీ వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉద్యోగస్తులు డ్యూటీలు దిగి ఇంటికెళ్లి సమయం కావడంతో పలుచోట్లు భారీగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మరోవైపు రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సోమవారం ఉదయం తీరం దాటే సూచనలున్నాయని, శనివారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45- 65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు